టేబుల్ స్పూను తేనెలో, టీస్పూను పెరుగు, అరటీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగేయాలి.
ఇలా చేయడం వల్ల ముఖం ఇన్స్టంట్ నిగారింపుని సంతరించుకుంటుంది.
ఈ ప్యాక్ పొడిచర్మానికి బాగా పనిచేస్తుంది
జిడ్డు చర్మతత్వం గలవారు ఈ ప్యాక్లో తేనెను తక్కువగా వేయాలి
తేనె, పెరుగు ముఖచర్మానికి చల్లదనం ఇవ్వడంతోపాటు తేమను అందిస్తాయి.
రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచి, తాజాదనంతో కూడిన వర్ఛస్సునిస్తుంది.