అర్ధ‌రాత్రి చిరుత నుంచి త‌ప్పించుకుని...

ముంబై: అర్ధ‌రాత్రి భ‌యంక‌ర శ‌బ్ధాలు విన‌డంతో నిద్ర‌లో నుంచి ఉలిక్కి ప‌డి లేచిన‌ కుటుంబం ఎదురుగా ఉన్న జంతువును చూసి షాక్‌కు గురైంది. ఓ ప‌క్క‌గా జింక బిక్కుబిక్కుమంటూ కూర్చుండ‌టం చూసి వారు అధికారుల‌కు స‌మాచారమిచ్చారు. ఈ అరుదైన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ముంబైలోని పోవాలి ప్రాంతంలో ఆదివారం ఉద‌యం ఒంటి గంట స‌మ‌యంలో ఓ మ‌చ్చ‌ల జింక త‌న‌ను వేటాడుతున్న చిరుత నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో పై క‌ప్పు నుంచి ఓ ఇంట్లో ప‌డింది. అప్ప‌టికీ ఆ పులి దాన్ని వ‌దిలిపెట్టకుండా వేటాడేందుకు ప్ర‌య‌త్నించింది. ఆ ఇంటి పైక‌ప్పుపై దాడికి దిగి అనంత‌రం వెనుదిరిగి వెళ్లిపోయింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top