వైరల్ : కుటుంబాల మధ్య ఘర్షణ
తిరువనంతపురం : రోడ్డుకు సంబంధించిన విషయంలో పలు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో వారు వీధిలో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ గొడవలో పురుషులే కాకుండా మహిళలు కూడా పాలు పంచుకున్నారు. కేరళలోని అరట్టుపుజ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఒక చోట మూడు మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించేందుకు పంచాయతీ తీర్మానించింది. దీంతో అక్కడ వివాదం చెలరేగింది.
రోడ్డు నిర్మాణం వల్ల తమ భూమి కోల్పోవాల్సి వస్తుందని కొన్ని కుటుంబాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. రోడ్డు వెడల్పు తగ్గించాలని డిమాండ్ చేశాయి. అయితే ఇది అవతలివారికి రుచించలేదు. దీంతో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. హింసకు దారితీసింది. పలు కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలైతే కిందపడి జట్లు పట్టుకుని తన్నుకున్నారు. దుస్తులు చిరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా, కరోనా వ్యాప్తి క్రమంలోనే ఈ వాగ్వాదం జరిగిందనే పుకార్లను అధికారులు తోసిపుచ్చారు. ఈ ఘర్షకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు