సిరాజ్ కు షాకిచ్చిన కోహ్లి!

న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన చివరి ట్వంటీ 20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది ఓవర్లకు కుదించబడ్డ మ్యాచ్ లో భారత్ కడవరకూ పోరాడి ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పొట్టి ఫార్మాట్ కివీస్ పై తొలిసారి సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ పేసర్ సిరాజ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లి మరిచిపోలేని షాకిచ్చాడు. మ్యాచ్ తరువాత ట్రోఫీని నేరుగా సిరాజ్ కు చేతికి అందించి కోహ్లి తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top