మైదానంలో జడేజా, ఇషాంత్‌ వాగ్వాదం!

ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఘోర పరాజాయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మలు గొడవపడిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. నాలుగో రోజు (సోమవారం) ఆటలో భాగంగా ఫీల్డింగ్‌ మార్పులో తలెత్తిన వివాదం ఇద్దరి ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top