బాల్ మాయం.. ఆటగాళ్ల అయోమయం!
మ్యాచ్ మధ్యలో బాల్ మాయమైంది. చుట్టూ కెమెరాలు.. మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు.. వేలకొద్ది అభిమానులు.. అంత మంది ఉండి కూడా బాల్ ఎక్కడికిపోతుంది? అంటారా? అవును బాల్ కొద్దిసేపు కనబడకుండా పోయి ఆటగాళ్లను, అంపైర్లను అయోమయానికి గురిచేసింది. పోని బ్యాట్స్మెన్ బంతిని గ్రౌండ్ అవతలికి కొట్టాడా? అంటే అది లేదు. స్ట్రాటజిక్ టైమ్ఔట్ ముందు వరకు ఉన్న బంతి.. అనంతరం కనిపించకుండా పోయింది. బౌలింగ్ వేయడానికి బౌలర్ సిద్దంగా ఉన్నాడు.. క్రీజులో బ్యాట్స్మన్ రెడీ అయ్యాడు. కానీ బంతి లేదు. ఏమైంది..? బంతి ఎక్కడా? అవును ఎక్కడా అందరూ ఇదే.! క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ.. కనివిని ఎరుగని ఈ వింత హాస్యాస్పదక ఘటన కింగ్స్పంజాబ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చోటు చేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు