దేవుడు నాకా శక్తిచ్చాడు..ధోని!
సీజన్ ఆరంభం నుంచే ప్రతికూలతలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోనుందా? కావేరీ ఆందోళనల కారణంగా సొంత గడ్డకు దూరం కావడం, కీలక ఆటగాళ్లు సురేశ్ రైనా, కేదార్ జాదవ్లు గాయాలతో టోర్నీకి దూరంకావడం, తండ్రి మరణించడంతో సౌతాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోవడం కోలుకోలేని పరిణామాలు. అంతలోనే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటం జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను కలవరపెడుతోంది.
దేవుడు ఆ శక్తి ఇచ్చాడు: ‘‘అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్కు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా’’ అని ధోనీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు