స్పీకర్ను కలిసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. తమ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్య తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వంతల రాజేశ్వరి ఈ నెల 4న టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు స్వయంగా టీడీపీ కండువా వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు