సురవరంని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన వైఎస్సార్ సీపీ బృందం అక్కడ పలువురు నేతలను కలిసి వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన తీరును వారి దృష్టికి తీసుకువెళుతుంది. సోమవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాల్సిందిగా కోరారు. అంతేకాకుండా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరును కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు