మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయానికి కారణమేంటో తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు అన్నారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం కన్నువేయడమే భయానికి కారణమన్నారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ఇంకా వెంపర్లాడుతూ తమపై విమర్శలు చేయడమా అని మండిపడ్డారు. కేంద్రమంత్రి రాందాస్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని విష్ణు స్పష్టం చేశారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయన్నారు. మరో వైపు 104 ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు