వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతల జులుం

వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతల జులుం పెచ్చు మీరుతోంది. నందమూరు వరద బాధితులకు అండగా నిలిచినందుకు తాడేపల్లిగూడెం వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణతో పాటు కొంతమంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై ఈ ఆదివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం నందమూరు గ్రామంలో వరద బాధితులకు అన్యాయంపై ఆయన అధికారులని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అదే సమయానికి నందమూరుకు వచ్చిన కలెక్టర్‌ కాటమనేనికి జరిగిన విషయంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top