దీక్షలో కూర్చున్న విజయమ్మ!
ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం హస్తిన వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్రెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీలతోపాటు దీక్షలో కూర్చున్నారు. వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు