34వ రోజు పాదయాత్ర డైరీ

పాదయాత్రలో ఈ రోజు నాలుగడుగులు పడగానే నా దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు. నాతో చెయ్యి కలపాలని తాపత్రయం.. కానీ కలపలేకపోతున్నాడు. ఆయన భుజం మీద చెయ్యి వేశాను. ‘అన్నా.. నీతో చెయ్యి కలపాలనుంది.. కానీ కలపలేను.. అని కంటతడి పెట్టాడు. అతని బాధ నన్ను కదిలించి వేసింది. పేరడిగితే నరసింహారెడ్డి అని చెప్పాడు. ‘అన్నా.. మరుట్ల సబ్‌స్టేషన్లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పదేళ్లు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేశా.. ఈ ఏడాది ఆగస్టులో డ్యూటీలో ఉండగా కరెంట్‌ షాక్‌తో రెండు చేతులు దెబ్బతినడంతో నా చేతి వేళ్లు కొన్ని తీసేయడంతో రెండు చేతులూ పని చేయడంలేదు. ఉద్యోగం చేయలేకపోతున్నా.. వైద్యానికి రూ.ఆరు లక్షలైంది.. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో నా కుటుంబం రోడ్డున పడింది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఉద్యోగికి సర్కారు నుంచి వైద్య, ఆర్థిక సాయం అందలేదంటే నిస్సందేహంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top