చిలుక, గోరింక అసూయ పడేలా కాపురం చేశారు..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నాయుడు.. మళ్లీ నల్లచొక్కాలు వేసుకుని ధర్మపోరాట దీక్షలు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసగించారు. ఆయన మాట్లాడుతూ..‘మీ ఆశీస్సులతో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీ గుండె చప్పుడు విన్నాను.. మీ ఆవేదన చూశాను. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. రుణమాఫీ పేరిట రైతులను, డ్వాక్రా సంఘాల అక్కాచెల్లమ్మలను మోసం చేశారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top