చంద్రబాబు పాలనలో రైతులకు మిగిలింది దుఃఖమే

అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వ్యవసాయం పండగ చేస్తామని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా రేపల్లేలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రైతన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతన్న కన్నీరు పెడితే అరిష్టమని తాను నమ్ముతానని తెలిపారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని  వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ, ఆయన జిమ్మిక్కులకు మోసపోవద్దని ప్రజలను కోరారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top