259వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 259వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖ నార్త్‌ నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం వరకు కొనసాగుతుంది. అక్కడ జననేత పాదయాత్ర విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత  దొండపర్తి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌  మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌  భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top