విజయనగరంలో రేపు సంకల్పయాత్ర పునః ప్రారంభం

 ధీరోదాత్తుడు మళ్లీ ప్రజా సంకల్పయాత్రకు సిద్ధమయ్యారు. తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కోలుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు పయనమవుతున్నారు. హత్యాయత్నం జరిగిన నాటి నుంచి తమ అధినేత జగన్‌ త్వరగా కోలుకోవాలని, మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సంకల్పయాత్ర కొనసాగించాలని పార్టీ నాయకులు, అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించి నేడు సంకల్పయాత్ర పునః ప్రారంభిస్తున్నారు. హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకుని తొలిసారిగా విశాఖ వస్తున్న తమ అభిమాన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top