ఐటీ శాఖ సోదాలు చేయకూడదట..
‘ఆపరేషన్ గరుడ’ అనే పేరుతో ఢిల్లీ పెద్దల ప్రమేయంతో తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని టీవీల్లో మోత మోగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి దీనిపై విచారణ జరిపించాల్సిందిగా భారత రాష్ట్రపతిని ఎందుకు కోరరు? విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో కేసెందుకు వేయరు?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు రాష్ట్రంలో మోసపూరిత, దోపిడీ పాలన సాగించారని మండిపడ్డారు. ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జాతీయ,, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలపైనా పోరాటం చేస్తానని డ్రామా లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు