బెల్టుషాపుల రద్దు సంతకం ఏమైంది?
పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ అసువులు బాసిన ముదునూరి సుబ్బమ్మ మరణానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, అందుకు పూర్తి బాధ్యత ఆయనే వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగ నీతులకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గద్దె నెక్కగానే చంద్రబాబు చేసిన తొలి సంతకాలకు అర్థం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరిని తూర్పారబడుతూ జగన్ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు