153వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్దాలపాలెం నుంచి శనివారం ఉదయం జననేత వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు.బంటుమిల్లి క్రాస్ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి అడుగుపెడతారు. అక్కడి నుంచి తోటమాల చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పెడన చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. కొంకెపూడి వరకు పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు