మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మొయిదా జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. రోడ్డు మొత్తం ఇసుకవేస్తే రాలనంతా జనంతో నిండిపోయింది. ఆ సమయంలోనే ఓ గర్భిణి ఆ మార్గంలో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ కాసేపు తన ప్రసంగాన్ని ఆపి.. ఆ ఆటోను దారి ఇవ్వాల్సిందిగా అభిమానుల్ని, కార్యకర్తలను కోరారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top