88వ రోజు ముగిసిన పాదయాత్ర
ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి గురువారం ఉదయం ప్రారంభించిన వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు ముగిసింది. ఆదిమూర్తిపురం, తూర్పు ఎర్రబల్లిక్రాస్, కొండాపురం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర 11:30 గంటలకు రేనమాలకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు జననేత వైఎస్ జగన్ లంచ్ విరామం తీసుకున్నారు. అనంతరం 2:45 గంటలకు మళ్లీ పాదయాత్ర కొనసాగించిన వైఎస్ జగన్ రేనమాలలో మహిళలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు పాదయాత్ర ముగిసింది. నేడు జననేత వైఎస్ జగన్ 12 కి.మీ పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ ఇప్పటివరకూ 1193.7 కిలోమీటర్లు నడిచారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు