35వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌

రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర గురువారానికి 35వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఆ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ పత్రికలకు విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇదే నియోజకవర్గంలోని అనంతపురం రూరల్‌ మండలం కందుకూరుకు 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ జెండా ఎగురవేస్తారు. తర్వాత 11.30 గంటలకు హంపాపురం క్రాస్‌ రోడ్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30కు చిగిచర్ల వరకు పాదయాత్ర కొనసాగించి అక్కడ రాత్రి బస చేస్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top