270వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసి విజయనగరానికి చేరింది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం తుమ్మికపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి అడ్డుపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్, గంగుపుడి జంక్షన్, లక్కవరపుకోట మండలం మల్లివీడు, గోల్డ్స్టార్ జంక్షన్, జమ్మాదేవి పేట, రంగాపురం క్రాస్ మీదుగా రంగరాయపురం వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు