కానిస్టేబుల్పై దాడి చేసిన యువకులు
స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్పై యువకులు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలన సృష్టించింది. సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు గురువారం మోటారు సైకిల్పై వెళ్తుండగా ఆనంద్ నగర్ ఆటో స్టాండ్ వద్దకు వచ్చేసరికి వెనుక వైపు నుంచి మోటారు సైకిల్పై వచ్చిన ముగ్గరు యువకులు అతడి మైటారు సైకిల్ను ఢీ కొట్టారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఆ యువకుల మోటార్ సైకిల్ నంబర్ను సెల్ఫోన్లో ఫోటోలు తీస్తుండగా వారు అతనితో ఘర్షణకు దిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు