కేసీఆర్‌ కోసం నాలుక కోసుకున్న యువకుడు

రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అంటే తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానం వ్యక్తమవుతోంది. గతంలో కేసీఆర్‌ ఆంధ్రకు వెళ్లిన సమయంలో ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున కటౌట్లు వెలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంధ్రా యువకుడు కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ.. తన నాలుకను కోసి దేవుడి మొక్కు తీర్చుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన బంజారాహిల్స్‌లోని బుధవారం ఓ ఆలయంలో చోటుచేసుకుంది.పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేశ్‌కు కేసీఆర్‌ అంటే ఇష్టమని తెలుస్తోంది. తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. బంజారాహిల్స్‌లోని ఓ ఆలయంలో నాలుకను కోసుకున్నాడు. కోసిన నాలుకను దేవాలయం హుండీలో కానుకగా వేసి మొక్కు తీర్చుకున్నాడు. దీంతో మహేశ్‌కు తీవ్ర రక్తస్రావం అయింది. అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top