మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తమకు ఇష్టం లేని వాళ్లను పెళ్లి చేసుకున్న పిల్లలపై కన్న తల్లిదండ్రులే కత్తులు దూస్తున్న సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేపై స్వయానా ఆయన కూతురు ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దళితుడిని పెళ్లి చేసుకున్న కారణంగా తనను, తన భర్తను చంపేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. తండ్రి నుంచి తమను కాపాడాలంటూ పోలీసులకు విఙ్ఞప్తి చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top