చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు మర్చిపోరు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. యూటర్న్‌ అంకుల్‌ చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వస్తున్నారన్నారు. గతంలో అన్ని పార్టీలతో జతకట్టి.. తర్వాత అందరినీ వదిలిపెట్టిన చంద్రబాబు మళ్లీ పార్టనర్‌ కోసం ఢిల్లీకి వస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు మర్చిపోరని తెలిపారు. ఓటుకు నోట్లు కేసుతో పాటు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో చంద్రబాబు లక్ష కోట్లకు పైగా స్కామ్‌లు చేశారని ఆరోపించారు. అన్నీ స్కాంలపై రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వాలకు తెలిపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top