ఇది సహజ మరణమా? లేక ఎవరైనా ఉన్నారా?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందని, కానీ పరిసరాలు  చూస్తే వివేకానంద రెడ్డి మృతిపై అనుమానం కలుగుతుందన్నారు. ఇది సహజ మరణమా? లేక ఎవరైనా ఉన్నారా? అనేది లోతైన దర్యాప్తు ద్వారా తేల్చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కారులో బయలుదేరి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అక్కడి పరిస్థితి తమందరికి తెలియదని, అందిన సమాచారం ప్రకారం అనుమానస్పద మృతి అనుకుంటున్నామన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top