వైఎస్ఆర్సీపీలోకి కొనసాగుతున్న వలసలు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. వైఎస్సార్సీపీలో చేరే నాయకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారద, ఆమె భర్త దొంతు బాలకృష్ణ మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి వచ్చారు. వీరికి వైఎస్ జగన్ పార్టీ కండువాలతో సాదర స్వాగతం పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు