గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారు

గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని.. గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో కర్ఫ్యూ నడిపిస్తోందని విమర్శించారు. మంగళవారం ఉండవల్లి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదేనని అమిత్‌ షా చెబుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top