సతీసమేతంగా గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే

శివసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ బుధవారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ఒకవైపు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు ఉద్ధవ్‌ రాజ్‌భవన్‌ వెళ్లి.. మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. గురువారం ముంబైలోని శివాజీ పార్కులో అట్టహాసంగా జరగనున్న కార్యక్రమంలో మహా వికాస్‌ అఘాది (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) తరఫున ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top