లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు
అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని నానికి బదులుగా ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా సభలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. గల్లా జయదేవ్ ప్రసంగంపై టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా విభజించారని, తెలంగాణ కొత్త రాష్ట్రం కాదని, ఏపీ మాత్రమే కొత్త రాష్ట్రమని, విభనతో తెలుగు తల్లిని రెండుగా చీల్చారని ఆయన వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు