జనసేన కార్యకర్తల ఓవర్‌ యాక్షన్‌

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన.. పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గురువారం హార్సిలీ హిల్స్‌లోని గాలిబండకు చేరుకున్నారు. గాలిబండ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. హార్సిలీ హిల్స్‌కు వచ్చిన ప్రతి టూరిస్ట్‌ గాలిబండకు వెళ్లాలని, అక్కడి అందాలను చూడాలని అనుకుంటాడు. కానీ, పవన్‌ కల్యాణ్‌ అక్కడ ఉన్నారంటూ పర్యాటకుల పట్ల జనసేన కార్యకర్తలు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు. పర్యాటకులు గాలిబండకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి జనసేన కార్యకర్తలు పర్యాటకులను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top