ఈనాటి ముఖ్యాంశాలు

దక్షిణాసియాలోని తొలి క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్ భార‌త్‌, నేపాల్ మధ్య ప్రారంభమైంది. తమిళనాడులోని వేలూరు జిల్లాలో మంగళవారం ఘోర రైలు ప్రమాదం తప్పింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్భాటంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నటి ఊర్మిళా మటోండ్కర్‌ ఆరు నెలలు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పల్నాడులో సెక్షన్ 144 సీఆర్పీసీ, సెక్షన్ 30 యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలు నేటికీ మర్చిపోలేని భయంకర దృశ్యాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top