ఈనాటి ముఖ్యాంశాలు

మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో భేటీ అయింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక అందజేసింది. ఇక, రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్‌ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఇకపోతే, దేశంలో అలజడులు, అల్లర్లు సృష్టించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌  మండిపడ్డారు. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్‌కు ప్రజలు అడుగడుగునా మద్దతు తెలుపుతూ కేసీఆర్‌ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చేలా తీర్పులిస్తూ వచ్చారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top