బోల్తా పడిన కారు,ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. మగనురు మండలంలోని నల్లగట్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా వస్తున్నట్టు సమాచారం. దీంతో అదుపుతప్పిన కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top