నగర శివారులో దొంగలు బీభత్సం

నగర శివారులోని దుండిగల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దోపిడీ యత్నాన్ని అడ్డుకోబోయిన దుండిగల్‌ ఎస్సై శేఖర్‌ రెడ్డిపైకి కారు ఎక్కించేందుకు యత్నించారు. దుండిగల్‌ ప్రాంతంలోని ఓ జ్యుయెలరీ షాప్‌ వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యాన్‌ నిలిచి ఉంది. సిబ్బందితో కలిసి అటుగా వెళ్తున్న ఎస్సై శేఖర్‌రెడ్డి ఆ వాహనాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసుల రాకను గమనించిన దొంగలు.. వ్యాన్‌లో వేగంగా ముందుకు దూసుకెళ్లారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top