తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకలజనులను ఆకట్టుకునేందుకు సమగ్ర కసరత్తు చేసింది. ‘సమూల మార్పు కోసం.. సమగ్ర ప్రణాళిక’పేరుతో మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 35 అంశాలతో రూపొందించిన కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు హామీల జల్లు కురిపించింది. రూ.2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ, రైతుబంధు విస్తరణ, నిరుద్యోగభృతి వంటి హామీలిచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top