ఎమ్మెల్యే బోడె ఓవరాక్షన్
రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన పొక్లెయిన్ను తరలించకుండా అడ్డుకోవడమే కాకుండా కృష్ణాజిల్లా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దానిని తన గెస్ట్హౌస్లో దాచిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత సృష్టించింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీషాసింగ్తో ఎమ్మెల్యే వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్.. పొక్లెయిన్ను సీజ్ చేయాలని, దానిని తరలించిన వారిని, భూమి తవ్వకాలు, చదును చేసినవారిని అరెస్టు చేయాలని ఆదేశించినా శనివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. పెనమలూరు మండలం వణుకూరులో రూ.10 కోట్లు విలువ చేసే 2.84 ఎకరాల పుల్లేరు కట్టభూమిపై టీడీపీ నాయకులు కొందరు కన్నేశారు. కట్టను తవ్వుతున్న వైనంపై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్ పొక్లెయిన్ను సీజ్ చేయాలని పెనమలూరు తహసీల్దార్ మురళీకృష్ణ, సిబ్బందిని ఆదేశించారు. దీంతో అధికారులు సదరు భూమిలో పనులు కొనసాగిస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేశారు. వాహనంలో తరలిస్తుండగా ఎమ్మెల్యే ప్రసాద్ తన గన్మెన్లతో అక్కడికి వచ్చారు. పొక్లెయిన్ను తరలిస్తే సహించేది లేదంటూ దానిని పోరంకిలోని తన గెస్ట్హౌస్ కం ఆఫీస్ వద్దకు తరలించి దాచేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు