ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనను’ స్వాగతిస్తున్నాం
‘మనమంతా ఇక్కడే ఎదిగాం.. ప్రభుత్వం ఈ నగరాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటే మద్దతివ్వాల్సిన కనీస బాధ్యత మనకుంది.. మిగిలిన విషయాలు, అనుమానాలు, అపోహల గురించి తర్వాత మాట్లాడదాం.. ముందు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనను మనం బేషరతుగా సమర్ధించాల్సిందే.. ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందే.. ’ అని జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు తీర్మానించడం చర్చకు తెరలేపింది. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని విశాఖ అర్బన్, రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ విభాగాలుబేషరతుగా స్వాగతించాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో సమావేశమైన టీడీపీ నేతలు విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు