తన్విత కేసులో పెంచిన తల్లికి ఊరట
ఇల్లెందు పట్టణంలోని స్ట్రట్ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప – రాజేందర్ల దత్త పుత్రిక తన్వితకు తాత్కాలికంగా విముక్తి లభించింది. 160 రోజుల పాటు ఖమ్మం బాలల సదనంలో ఉన్న తన్విత.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బుధవారం రాత్రి బాలల సదనం నుంచి పెంపుడు తల్లి వేముల స్వరూప చెంతకు చేరింది.
తన్వితను తనకే అప్పగించాలని, కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు తనవద్దే ఉంచే లా ఆదేశించాలని స్వరూప కోర్టును అభ్యర్థించింది. ఆమె ఫిర్యాదును విచారించిన కోర్టు.. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి తన్వితను బాలల సదనంలో ఉంచటం కంటే పెంపుడు తల్లి విన్నపం మేరకు ఆమెకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు