ఇటలీలో ఘోర ప్రమాదం,ఇద్దరు మృతి

ఇటలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న ఓ ట్రక్కు, లారీ వెనకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రోడ్డు మార్గం పాక్షికంగా పాడైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 70 మందికిపైగా గాయాలయ్యాయి. ఉత్తర ఇటలీలోని బొలోగ్నా నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు దాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దట్టమైన పొగకారణంగా చుట్టుపక్కల నివసించే ప్రజలు తాత్కాలిక ఉపశమనం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top