గడ్డాలు, మీసాలు పెంచుకుంటే అధికారం వస్తుందా?
ఉత్తమ్కుమార్ గడ్డాలు, మీసాలు పెంచుకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందా అని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అధికారం పోవడంతో పిచ్చిపట్టినట్టుగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 కాదు కదా 7 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు