కీలక మలుపు.. ఎమ్మెల్యేలతో బలప్రదర్శన
మహారాష్ట్ర మరోసారి హైడ్రామా నెలకొంది. రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పరేడ్ (బలప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 7గంటల తరువాత 162 మంది ఎమ్మెల్యేలతో ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్కు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా ఒకదగ్గరకు చేరుకున్నాక వారందరితో పరేడ్ (బలప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. పరేడ్గా వెళ్లి ఎమ్మెల్యేలంతా గవర్నర్ను కలువనున్నారు. దీని కోసం ఇప్పటికే సభ్యులంతా సిద్ధమయ్యారు. సభ్యులంతా మా బలం 162 మంది అంటూ ప్లేకార్డులు ప్రదర్శిస్తున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, శరద్ పవార్, సుప్రియా సూలే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదివరకే అక్కడకు చేరుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు