ఒక్కటైన బ్యాడ్మింటన్ స్టార్స్

పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు శుక్రవారం సాయంత్రం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్‌ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య ఈ ‘రాకెట్‌ స్టార్స్‌’ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అనంతరం ‘నా జీవితంలో ఇదే  గొప్ప మ్యాచ్‌’ అంటూ సైనా ట్వీట్‌ చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 16న హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో రిసెప్షన్‌ ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్‌ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top