ఏపీ భవన్‌లో మీడియాపై ఆంక్షలు!

ప్రత్యేక హోదా ఆందోళనలు కవర్ చేస్తున్న మీడియాపై ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిషేధాజ్ఞలు విధించారు. రెండురోజులు పాటు ఇంటర్వ్యూలు చేయొద్దని అనధికారికంగా హుకుం జారీ చేశారు. ఆందోళనలు ప్రసారం చేసేందుకు ప్రయత్నించిన సాక్షి టీవీ విలేకరులను కూడా పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ భవన్‌లో ఇంటర్వ్యూలు చేయొద్దని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top