బీజేపీపై కాంగ్రెస్‌ చీఫ్‌ మండిపాటు

ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ దేశాన్ని అడ్డగోలుగా చీల్చేస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కోపతాపాలు, విభజనవాదమే కనిపిస్తున్నదని, ఈ పరిస్థితులను మార్చి, మళ్లీ దేశాన్ని ఒక్కటిగా చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందన్నారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 84వ కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ సమావేశాలను ఆయన ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ ప్లీనరీకి అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యనాయకులు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top