‘జమ్మూ కశ్మీర్ హక్కులు కాలరాయటం దేశ ద్రోహమే’
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా కేంద్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం కంటే రాజకీయ, దేశ ద్రోహం మరొకటి ఉండదు’ అని తన ట్విటర్లో ఖాతాలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు విమానంలో తిరిగి వస్తున్న సమయంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రియాంక ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు