‘సభ్యునిగా ప్రతిపాదిస్తున్నా.. మండలిని రద్దు చేయండి’
శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసహనం వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలని ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపాదిస్తున్నానని అన్నారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. చట్టాలు చేసే సభలో సభాపతులు వ్యవహరించిన తీరుపై చర్చించడం దారుణమన్నారు. బుధవారం మండలిలో జరిగిన చర్చలో మంత్రుల సలహాలను చైర్మన్ పట్టించుకోలేదని ఆరోపించారు. కావాలనే బిల్లులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ను ప్రభావితం చేశారని ఆరోపించారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే పెద్దల ఉందన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసే సభాధిపతులే.. చట్టాలను అతిక్రమిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు